DEVOTIONALNATIONALOTHERS

స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించండి-సుప్రీమ్

అమరావతి: సున్నితమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.. ఐదుగురు సభ్యులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి తెలిపారు..ఇందులో ఇద్దరు సీబీఐ,, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు,,ఒకరు ఫుడ్‌ సేఫ్టీ అధికారితో సిట్‌ ఏర్పాటు చేయాలని సూచించారు..ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్‌ సూపర్‌ వైజ్‌ చేయాలన్నారు..తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది హిందు భక్తులకు సంబంధించిన అంశమని,,ఇందులో రాజకీయ ప్రయోజనాలు వద్దని సుప్రీంకోర్టు కోరింది..లడ్డూ వివాదంపై శుక్రవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిష్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.. ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (సిట్‌)ను కొనసాగించాలా? లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని గత విచారణలో సుప్రీంకోర్టు అడిగిన దానికి ఆయన బదులిచ్చారు.. లడ్డూ వ్యవహారంలో ఆరోపణలు నిజమైతే అది ఆమోదయోగ్యం కాదన్నారు.. ఈ కేసు విచారణకు సిట్‌ విచారణ ఒక్కటే సరిపోదని,,కేంద్రం నుంచి పర్యవేక్షణ ఉండటం మంచిదని తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *