డిజిటల్ మోసాల ద్వారా రూ.54,000 కోట్లకు పైగా దొపిడీ-సుప్రీంకోర్టు
బ్యాంకు అధికారులు నేరగాళ్లకు సహకరిస్తున్నారా?..
అమరావతి: స్వాహా చేయడాన్ని పూర్తిస్థాయి ” డెకాయిటీ లేదా దోపిడీ”గా అభివర్ణించింది.అటువంటి కేసులను పరిష్కరించడానికి RBI, బ్యాంకులు,టెలికమ్యూనికేషన్ల శాఖతో సంప్రదించి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(SoP) రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. డిజిటల్ మోసాల కేసును ధర్మాసనం సుమోటోగా విచారణను చేపట్టింది.
చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువే:- డిజిటల్ మోసం ద్వారా దొపిడీ చేసిన మొత్తం, అనేక చిన్న రాష్ట్రాల బడ్జెట్ల కంటే ఎక్కువ అని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మల్య బాగ్చి,N.V అంజరియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించాలని CBIని ఆదేశించింది.గుర్తించిన డిజిటల్ అరెస్ట్ కేసులలో దర్యాప్తును కొనసాగించడానికి దర్యాప్తు సంస్థకు అనుమతి ఇవ్వాలని గుజరాత్-ఢిల్లీ ప్రభుత్వాలను కోరింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు:- ఆర్బీఐ, టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, ఈ నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి 4 వారాల్లోగా ఒక ముసాయిదా ఒప్పందాన్ని సిద్ధం చేయాలని హోం మంత్రిత్వ శాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్ట్ కేసులను గుర్తించాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసుల్లో విచారణ జరిపేందుకు సీబీఐకి అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని దిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలకు నిర్దేశించింది. డిజిటల్ అరెస్ట్ బాధితులకు పరిహారం అందించే విషయంలో ఉదారంగా, ఆచరణాత్మక దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. పరిహారం చెల్లింపుపై ఒక ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయడానికి ఆర్బీఐ, టెలికాం శాఖ సంయుక్తంగా సమావేశం కావాలని ఆదేశించింది.
బ్యాంకులపై న్యాయమూర్తుల ఆగ్రహం:- “బ్యాంకులు కేవలం లాభాపేక్షతో, వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నందున, నేరగాళ్లు సులభంగా దోపిడీ సొమ్మును తరలించడానికి వేదికలుగా మారుతున్నాయి” అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యనించారు.2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్య మన దేశంలో ఏకంగా రూ.52 వేల కోట్ల సైబర్ మోసాలు జరిగినట్లు హోంశాఖ నివేదిక పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ డిజిటల్ మోసాలు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా నేరగాళ్లతో సహకరించడం వల్ల జరిగి ఉండవచ్చని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. డిజిటల్ అరెస్టుల పట్ల ఆర్బీఐ, బ్యాంకులు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సైబర్ మోసాల నివారణలో బ్యాంకులు క్రియాశీలక పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. “కోట్లాది రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థల ఖాతాల్లో భారీ లావాదేవీలు జరిగితే అనుమానం రాకపోవచ్చు. ఇదే సమయంలో కేవలం రూ.15-20 వేల పెన్షన్ తీసుకునే వ్యక్తి తాను కష్టపడి దాచుకున్న మొత్తం ఖాతా నుంచి ఒక్కసారిగా రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్డ్రా అవుతుంటే, మీ ఏఐ టూల్స్ ఆప్రమత్తం చేయడం లేదు?” అని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు.

