ఇటీవల నాకు జరిగిన ఆపరేషన్ ఎమీటి అంటే-పవన్ కళ్యాణ్
సమాజంలో మార్పు కోసంమే పార్టీ..
అమరావతి: నాకు ఆపరేషన్ అంటే ఏమైందో అన్న ఆందోళన జనసేన కార్యకర్తలతో పాటు అభిమానుల్లో వుందని,నాకు ఏం జరిగిందంటే… అంటూ ఇటీవల జరిగిన ఆపరేన్స్ గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టంగా తెలిపారు.శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ సమక్షంలో “జనసేన ఉద్యమి” సభ్యత్వాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన “జనసేన సాధక్” లతో సమావేశం నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడారు. పదవులపై మోజు వుండి వుంటే 2008లోనే ఎంపీగా పోటీ చేసి వుండే వాడిని అన్నారు.ప్రజలకు నా వంతు సేవా చేయాలనేదే నా ఆశయం అన్నారు.బయట నుంచి మాట్లాడే వాళ్లు నన్ను ఒక కులానికో,ఒక ప్రాంతానికో పరిమితం చేయ్యాలన్ని ప్రయత్నించారని అయితే నేను కులానికి,ప్రాంతానికి పరిమితం కాదల్చుకోలేదని స్పష్టం చేశారు.
