ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా సమావేశం అయిన సీ.ఎం విజయ్
అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సేవతీర్ధ్ లో బుధవారం నాడు మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. చోళుల కాలం నాటి రాగి శాసననాలకు పోలెండ్ నుంచి భారతదేశానికి రప్పించినందుకు మోదీకి, విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రకటించిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టు, దిగువ ప్రాంతాలపై దాని ప్రభావాన్ని విజయ్ ప్రధాని దృష్టికి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర గీతం పాడేందుకు అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు. విజయ్ తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలుసుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను 10 జన్పథ్లో కలుసుకోనున్నారు. విజయ్ సమావేశం నేపథ్యంలో జన్పథ్ వెలుపల రాహుల్-విజయ్ ఫోస్టర్లు వెలిసాయి. వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీల నేతలు కూడా తమిళనాడు హౌస్లో విజయ్ను కలుసుకోనున్నారు.

