హోర్ముజ్ జలసంధిని దాటిన 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురు
అమరావతి: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 3 జెయింట్ చమురు ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటి బయటకు వచ్చాయి.దాదాపు 60 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్లు సురక్షితంగా జలసంధిని దాటినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ వర్గాలు వెల్లడించాయి. హోర్ముజ్ను దాటిన ట్యాంకర్లలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాలకు చెందిన చమురు ఉన్నట్లు సమాచారం.గత రెండు నెలల నుంచి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుని పోయిన ఈ ట్యాంకర్లు ప్రధానంగా ఆసియా మార్కెట్లకు క్రూడాయిల్ను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త రావడంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.5 శాతం మేర తగ్గుదల నమోదు చేసింది.ఇలా చమురు సరఫరాలు అంతరాయం లేకుండా కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

