తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న”తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ”కు పోలీసులు అనుమతి నిరాకరించారు. జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జూన్ 2వ తేదిన హైదరాబాద్లో సభను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శాంతిభద్రతల పరిస్థితులు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తొంది.దీంతో సభ నిర్వహణపై ఉత్కంఠ నెలకొనగా, అనుమతి కోసం జనసేన పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

