నగరపాలక సంస్థ కార్యలయంలో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణం పురసేవా విభాగంలో నూతన ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభించారు.ఇందులో మొదటి సర్వీస్ గా కమిషనర్ నందన్ ఆధార్ సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మాధురి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శేషగిరిరావు, రహంతు జానీ, నరేంద్ర వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

