AP&TGNATIONAL

MSMEలకు కేంద్రం చేయూత-ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ లో రు.1280.43 కోట్లు

గ‌రిష్టంగా రు. 100 కోట్లు..

అమరావతి: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) దేశాలలో జరుగుతున్న సంక్షోభం వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) 5.0’ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వ్యాపారాలకు అదనపు రుణ సహాయం అందుతుంది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే ఈ అదనపు రుణాలపై ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) 100 శాతం, మిగిలిన సంస్థలకు 90 శాతం రుణ భరోసా ఉంటుంది.’స్టాండర్డ్’ లోన్ ఖాతాలు కలిగి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. వీరు 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4) లో వాడిన వర్కింగ్ క్యాపిటల్‌పై అదనంగా 20 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఈ అదనపు రుణం రూ.100 కోట్లకు మించకూడదు. ఈ పథకం కింద 31 మార్చి 2027 లోపు లోన్ మంజూరు కావాలి. అలాగే 30 జూన్ 2027 నాటికి లోన్ డబ్బులు చేతికి అందాల్సి ఉంటుంది.  ఈ పథకాన్ని ‘నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (NCGTC)’ పర్యవేక్షిస్తుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *