ఎంఐఆర్వీ వ్యవస్థతో కూడిన అగ్నిక్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
అమరావతి: అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ (MIRV) వ్యవస్థతో కూడిన అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని క్షిపణి యొక్క అధునాతన వెర్షన్ ప్రయోగాన్ని భారత్, గురువారం విజయవంతంగా నిర్వహించిందని రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో వేర్వేరు ప్రాంతాల్లో లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించింది. బహుళ పేలోడ్లతో ఈ పరీక్ష నిర్వహించారు.

