పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి
అమరావతి: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో శనివారం ఉదయం ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. బెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్.రవి,, సీఎంగా సువేందు అధికారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతోపాటు సీఎం చంద్రబాబు నాయుడు, యూపీతోపాటు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

