AP&TGCRIME

విశాఖపట్నం,లాడ్జీలో తల్లి,కొడుకులు ఆత్మహత్య

అమరావతి: విశాఖ పట్నంలొని ఓ లాడ్జీలో తల్లి,,కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. సింహాచలం, అడవివరంలోని లాడ్జీలో గాజువాకకు చెందిన కుడుపూడి నీలావతి (60), ఆమె కుమారుడు కుడుపూడి గయప్పాంజన్‌ (40) ప్యాన్‌కు ఉరివేసుకుని మరణించారని గోపాలపట్నం సీఐ ఎల్‌.ఎస్‌ నాయుడు తెలిపారు..శుక్రవారం లాడ్జీకి వచ్చిన ఇద్దరు ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌ కార్డుల ఆధారంగా మృతులు పాతగాజువాక శ్రామికనగర్‌కు చెందిన వారిగా గుర్తించామన్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని,,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.సాప్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న గయప్పాంజన్‌ హైదరాబాద్ కు చెందిన యువతిని వివాహాం చేసుకున్నాడు. వీరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్ధల కారణంగా భార్య 2023లో నాంపల్లి స్టేషన్‌లో కేసు పెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *