ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయంకు బుల్ డోజర్ యాక్షన్ చూపించిన భారత్
అమరావతి: ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయంకు భారతదేశం బుల్ డోజర్ యాక్షన్ అంటే ఏమిటో చూపించింది. ఇటీవల పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న బారికేడ్లను పాక్ ప్రభుత్వం తొలగించింది.
ఇస్లామ్ బాద్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న సెక్యూరిటీ బారికేడ్లను మూడు రోజులు క్రిందట, పాకిస్తాన్ ప్రభుత్వం తొలగించింది. దీంతో పాక్ చర్యకు భారత్ కూడా అదేరీతిలో బదులిచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వద్ద అదనంగా రక్షణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, ట్రాఫిక్ బొల్లార్డ్స్ వంటి నిర్మాణాల్ని బుల్డోజర్తో కూల్చేసింది. పాక్ రాయబార కార్యాలయ కాంపౌండ్ పరిధిలోని అనేక అనవసర నిర్మాణాల్ని కూల్చివేసింది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే. గతంలో ఇంగ్లండ్ లో ఖలిస్తాన్ ఉగ్రమూకలు భారత్ జెండాను తొలిగించిన సమయంలో అక్కడి సెక్కూరిటీ అధికారులు చూస్తూ వుండి పోయారు. దింతో ఇంగ్లండ్ వ్యవహరించిన తీరుకు బదులుగా డిల్డీలోని బ్రిటన్ రాయబారి కార్యలయం వద్ద వున్న సెక్యూరిటీ బారికేడ్లను,రక్షణ వ్యవస్థను తొలగించారు. దింతో దెబ్బకు దిగి వచ్చిన ఇంగ్లండ్ ప్రభుత్వం అక్కడ రాయబారి కార్యలయంకు పెద్ద ఎత్తున రక్షణ కల్పించింది. ఇంగ్లండ్ కే చుక్కలు చూపించిన న్యూ ఇండియాకు బొచ్చ పట్టుకు అడుక్కునే ఉగ్రవాద ఫ్యాక్టరీ అయిన పాకిస్తాన్ ఒక ??

