హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం-ఏడుగురు మృతి
అమరావతి: హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో శనివారం ఉదయం ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడి కింద ఉన్న రోడ్డుపై పడటంతో, డ్రైవర్, కండక్టర్తో సహా కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. బైరాగఢ్-తిస్సా రహదారిపై దేవికోఠి ప్రాంతంలోని చలుంజ్ మోర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది; ‘శర్మ బస్ సర్వీస్’కు చెందిన సదరు బస్సు బైరాగఢ్ నుండి చంబాకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ బస్సు ఉదయం సుమారు 6:30 గంటలకు బైరాగఢ్ నుండి బయలుదేరి, దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలంకు చేరుకుని క్షతగాత్రులను రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే కారణం అయి వుండవచ్చని తిస్సా పోలీస్ స్టేషన్ అదనపు SHO అనుభవ్ శర్మ పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

