AP&TG

పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం-ముఖ్యమంత్రి చంద్రబాబు

18వ ఎస్ఐపీబీ సమావేశంలో..

అమరావతి: పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకో సిస్టంను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించగలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 18వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలి. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పేద, మధ్య తరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాదు… సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *