AP&TGPOLITICS

మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం-సీ.ఎం చంద్రబాబు

ఎన్నికలకు ముందే నిర్ణయం..

మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నిక..

అమరావతి: బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం తరతరాలుగా వెనకబడిన కులాల సామాజిక న్యాయానికి NDA కూటమి ఇచ్చిన గౌరవం అన్నారు.హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఎన్నికలకు ముందే నిర్ణయం:- గత ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయన్నిసరిచేయడానికి ప్రత్యేక క్యాబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. బీసిలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు.

మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నిక:- అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో 28 జిల్లా పరిషత్‌లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందనే విషయాన్ని ఈ నిర్ణయం మరోసారి నిరూపించిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *