పుతిన్, జిన్పింగ్ లతో సమావేశం అయిన ప్రధాని మోదీ
అమరావతి: కిర్గిస్తాన్లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సులో ప్రధాన మంత్రి మోదీతో రష్యా అధ్యక్షుడు. కిర్గిస్తాన్లోని బిష్కెక్లో జరుగుతున్న 26వ SCO సదస్సులో ముగ్గురూ దేశాధినేతలు ఒకేసారి వేదికపై చేరి, ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు.ప్రధాన మంత్రి మోదీ, పుతిన్, జిన్పింగ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెలలోనే మోదీ, జిన్పింగ్ మరోసారి భేటీ కానుండటం విశేషం. ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరుకానున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ, జిన్పింగ్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి.

