టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వేల కోట్ల విలువైన 112 ఎకరాల కబ్జాలకు యత్నం?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హైదరాబాద్లో వేల కోట్ల విలువైన 112 ఎకరాల IT పార్క్ స్థలం కబ్జాకు ప్రయత్నం చేస్తున్నట్లు కేశినేని నాని(చిన్ని వాళ్ల ఆన్నయ్య) సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రగతి నగర్-శాంషీగూడలో ఐటీ కారిడార్ విస్తరణ కోసం TGIICకి కేటాయించిన అత్యంత విలువైన 112.72 ఎకరాల భూమిని కేశినేని చిన్ని కుటుంబ సభ్యుల బినామీ నెట్వర్క్ M/s ఎక్సెల్లా ప్రాపర్టీస్ ద్వారా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వే నెంబర్ 57 లోని భూమి పూర్తిగా పోరంబోకు సర్కారీ (ప్రభుత్వ భూమి) అని కలెక్టర్ తేల్చినా భూ కబ్జాలకు భూ బకాసులు యధేఛ్చగా పాల్పపడుతుండం గమనించ తగ్గ అశం.మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందొ వేచి చూడాలి.??


