AP&TG

కర్నూలు జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రత 45.4 డిగ్రీలు-విపత్తుల నిర్వహణ సంస్థ

తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం…

అమరావతి: రాష్ట్రంలో సోమవారం ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఆదివారం గరిష్ఠంగా కర్నూలు జిల్లా నగరడోనలో 45.4డిగ్రీలు నమోదైందని తెలిపారు.279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఎపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

సోమవారం (20-04-26) పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు.

తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం:- ద్రోణి ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు,పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.

ఆదివారం కర్నూలు(జి )నగరడోనలో 45.4°C, కడప(జి) ఖాజీపేటలో 44.5°C, కాకినాడ(జి) కరపలో 44.4°C, అనంతపురం(జి) రాయదుర్గం, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.3°C, తిరుపతి(జి)వరదయ్యపాలెం 43.8°C, మార్కాపురం(జి) అనుమలపల్లిలో 43.6°C, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 43.2°C, శ్రీసత్యసాయి(జి)  దాడితోటలో 43.1°C, అన్నమయ్య(జి) గాలివీడులో 42.7°C, ఒంగోలులో 42.2°C, పల్నాడు(జి) గురజాలలో 42.1డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *