CRIMENATIONAL

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతి

అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు,,మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు​ అగ్రనేతలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు..కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం కొండగావ్​కు చెందిన రిజర్వ్ గార్డ్,, పోలీసులు సంయుక్తంగా సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టాయి.. సెర్చింగ్ జరుపుతున్న భద్రతదళాలకు,మావోయిస్టులు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని బస్తర్​ రేంజ్ ఐజీ ​పీ సుందర్​రాజ్​ తెలిపారు..ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, AK-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.. మృతులు మావోయిస్టుల కమాండర్,,తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్,, ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్లు చెప్పారు.. వీరిలో హల్దార్ పై  రూ.8 లక్షలు,,రమేగాపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు..పూర్తి వివరాలు తెలియాల్సి వుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *