వారం రోజుల్లో దేశవ్యాప్తంగా, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం-ఐఎండీ
అమరావతి: నైరుతి రుతుపవనాలు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావంతోపాటు, ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల రానున్న వారం రోజుల్లో దేశవ్యాప్తంగా, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఏపీ, తెలంగాణలో ఐఎండీ అంచనల మేరకు.. దక్షిణ భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్నాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు అలాగే కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుసే అవకాశలు వున్నట్లు పేర్కొంది. తెలంగాణ, రాయలసీమలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

