101 ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించిన సీ.ఎం చంద్రబాబు
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో డోర్ టు డోర్ చెత్త సేకరణకు నూతనంగా మంజూరైన 101 ఎలక్ట్రిక్ ఆటోలను శనివారం గుడివాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. నగరంలొని గాంధీబొమ్మ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర… స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి నగర మేయర్ సుజాత, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్,తహసీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హజరైయ్యారు.

