NATIONAL

దీపావళీ నాడు భారత సైన్యంతో కలసి నిలబడడం గర్వంగా వుంది-ప్రధాని మోదీ

అమరావతి: సముద్ర జలాలపై మెరుస్తున్న సూర్యకిరణాలు,, సైనికుల చేతుల్లో వెలిగిన దీపాల కాంతి వలె దివ్యంగా కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు. సోమవారం గోవా తీరంలోని INS విక్రాంత్‌పై నౌకాదళ సిబ్బందితో కలసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతి దీపావళీకి త్రివిధ దళాలతో కలసి ప్రధాని మోదీ పండుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ దృశ్యం తన జీవితంలో ఎఫ్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.
INS విక్రాంత్ పేరు వింటే:- నాకు ఒకవైపు మహాసముద్రం,, మరోవైపు భారత సైన్యంతో కలసి నిలబడడం గర్వంగా వుందన్నారు. స్వదేశ పరిజ్ఞనంతో తయారు అయిన INS విక్రాంత్, భారత సైనిక సామర్థ్యాలకు ప్రతీక అని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌ సందర్భంగా కొన్ని రోజుల్లోనే పాకిస్థాన్‌ను మన మోకాళ్ల మీద పడేలా చేసిందని గుర్తుచేశారు. INS విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్రపట్టదని పరోక్షంగా పాకిస్తాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. INS విక్రాంత్ కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదని,,ఇది 21వ శతాబ్దపు భారత కృషికి, ప్రతిభకు, నిబద్ధతకు ప్రతీక అని అన్నారు.
త్రివిధ దళాల సమన్వయంతో:- ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా మే 7వ తేదీన భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో భారత త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి,, పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని అనేక ఉగ్ర స్థావరాలను విజయవంతంగా దెబ్బతీశాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. త్రివిధ దళాల సమన్వయం పాక్‌ను ఓటమి ఒప్పుకునేలా చేసిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *