దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత
అమరావతి: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సుస్మిత కొణిదెలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు స్పెషల్ ఇన్వైటీగా(ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు, ఈవోకు అవసరమైన సందర్భాల్లో తన అనుభవంతో సుస్మిత సలహాలు ఇవ్వనున్నారు. ప్రధాన ఆలయ ఉత్సవాలు, జాతరల సమయంలో దేవస్థానం నిర్వహణకు సహకరించనున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సుస్మితకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం కల్పించారు. దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెలకు ప్రత్యేక బాధ్యత.. ఆలయ ఉత్సవాలు, నిర్వహణలో తన అనుభవంతో సహకరించనున్నారు.

