ఉగ్రదాడికి పాల్పపడిన వారిని గుర్తించి నిఘా వర్గాలు-ఏరివేత ప్రారంభం
అమరావతి: జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులను గుర్తించి వేటాడే పనిలో వున్న నిఘా వర్గాలు,, అందులో భాగంగా నాలుగురు ఉగ్రవాదుల చిత్రాలను బుధవారం విడుదల చేశాయి.. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది..ఆ సంస్థ టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్ ఈ ఘటనకు ప్రధాన సూత్రదారి అని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి..అలాగే రావల్ కోట్లోని ఇద్దరు వ్యక్తులతో ఈ సంఘటనకు ప్రమేయం ఉందని వెల్లడించాయి..ఆ దిశగా నిఘా వర్గాలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి..
పర్యటనను అర్థాంతరంగా ముగించికొని:- ఈ సంఘటనపై సమాచారం అందగానే విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్లో ఉన్న ప్రధాని మోదీ,, విదేశీ పర్యటనను అర్థాంతరంగా ముగించికొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు.. అనంతరం జమ్మూ కశ్మీర్ భద్రతపై జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్తోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్తో మోదీ అత్యసవరంగా సమావేశమయ్యారు..
ఉగ్రవాదుల ఎరివేతకు యుద్ద ప్రాతిపదికన:- ప్రధాని అదేశాలతో జమ్మూ కశ్మీర్ చేరుకుని,,పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించారు..అనంతరం స్థానిక భద్రతపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో సమీక్షించారు..అలాగే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతకు యుద్ద ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు..
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం:- జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భయానక ఉగ్రదాడి తరువాత బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి..ఈ ఎన్కౌంటర్ మంగళవారం రాత్రి ప్రారంభమై బుధవారం ఉదయం వరకు కొనసాగింది..భద్రతా దళాలు తెలిపిన వివరాల ప్రకారం…బారాముల్లాలోని ఉరి నాలా వద్ద సర్జీవన్ జనరల్ ఏరియా ద్వారా ఇద్దరు ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించడంతో ఎన్కౌంటర్ జరిగిందని,,ఎన్ కౌంటర్ అనంతరం భారీగా ఆయుధాలు,, సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చినార్ కార్ప్స్ వెల్లడించింది.
నిఘా వర్గాలు కీలక ప్రకటన:- టూరిస్టులను పహెల్గామ్కు తీసుకెళ్లిన (గుర్రంపై) హార్స్ రైడర్ హుస్సేన్,,పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించగా ఉగ్రవాదులు,,కాల్పులు జరపడంతో హుస్సేన్ మృతి చెందారు.. ఉగ్రదాడిలో అమెరికాలో తయారైన M4, AK-47/56 అసాల్ట్ గన్స్ ను వాడినట్లు నిర్ధారించాయి..స్థానికుల సహకారంతో దాడిని అమలు చేశారని నిఘా వర్గాలు తెలిపాయి.. పహెల్గామ్ ఉగ్రదాడిని హెల్మెట్ కెమెరాలతో దాడిని ముష్కరులు చిత్రీకరించారు.. ఉగ్రవాదులు,, టూరిస్టులను చంపే ముందు ఐడీలను చెక్ చేశారు..పర్యాటకులపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి వచ్చారు..ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న అసలైన సైనికులను చూసి బాధితులు వణికిపోయారని స్థానికులు తెలిపారు.