ఘటనకు బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టాం-అమిత్ షా
అమరావతి: జమ్మూ కశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో బుధవారం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు..గురువారం శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంచి పర్యాటకుల మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి వారికి ఆయన నివాళులర్పించారు.. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి, వారిని ఓదార్చారు..ఈ సంఘటనపై వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వారిని స్వయంగా అడిగి తెలుసుకొన్నారు..ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు..దారుణమైన సంఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.