10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 84.09 శాతం ఉత్తీర్ణత సాధించిన బాలికలు
అమరావతి: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆన్ లైన్ లో బుధవారం ఫలితాలను విడుదల చేశారు..ఈ సంవత్సరం జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు.. వీరిలో బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా,,బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు.. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు
రాగా ఇదే సమయంలో 19 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.. మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో జిల్లాల వారీగా పదోతరగతి ఫలితాల పర్సంటేజి వివరాలు:-