AP&TGOTHERSSPORTS

స్పోర్ట్స్ హబ్ గా తిరుపతి జిల్లాను తీర్చిదిద్డుతాం-క్రీడాశాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి

మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహావిష్కరణ..
తిరుపతి: రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రెండు శాతం ఉన్న స్పోర్ట్స్ కోటానూ మూడు శాతం కోటాతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖమంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు..బుధవారం స్థానిక ఎస్.వి ఆర్ట్స్ కాలేజ్ లోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతిలో పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడి విగ్రహావిష్కరణ జరిగింది..
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. నారా లోకేష్ బాబు నాయకత్వంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సౌకర్యాలతో ఇండోర్ స్టేడియంను ప్రారంభించడం జరిగిందన్నారు.. క్రీడాకారుల గౌరవం కోసం, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా..రాష్ట ప్రభుత్వం 3 శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు.. ఓలిపింక్స్, ఏషియన్ గేమ్స్ పాల్గొనడానికి వెళ్లే విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇవ్వడం, శిక్షణ కాలంలో ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వo భరిస్తుందని తెలిపారు.


జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలో అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు..తిరుపతి స్మార్ట్ సిటీ వారి ఆధ్వర్యంలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగిందని, జిమ్, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టు, షటిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో దాదాపు 800 మంది విద్యార్థులు, ఇతరు ఈ సౌకర్యాలను ప్రతిరోజు ఉపయోగించుకుంటున్నారని అన్నారు.. మొదటి సారిగా ఒక ఇండోర్ రైఫిల్ షూటింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు..ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన పికిల్ బాల్ గేమ్ ను కూడా శ్యాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడ‌ల‌కు ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంద‌ని చెప్పారు. క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, మంత్రి లోకేష్ లు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.టి.డి బోర్డ్ మెంబర్ పనబాక లక్ష్మి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రో.ఉమ, మాజీ ఎం.ఎం.ఏ సుగుణమ్మ, డిప్యూటి మేయర్ లు ముద్ర నారాయణ, మునికృష్ణ, డి.ఎస్.డి.ఓ సయ్యద్ సాహెబ్, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *