NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం

భద్రత కమిటీ 5 కీలక నిర్ణయలు
అమరావతి: జమ్ము కశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన జరిగిన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఎస్) దిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగింది..ఈ సమావేశ:లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,, విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ తదితరులు పాల్గొన్నారు..పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..ప్రధాని నేతృత్వంలో జరుగుతున్న అత్యున్నత స్థాయి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదిఉత్కంఠగా మారింది.. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని బుధవారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.. విమానాశ్రయంలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దొవల్‌,, విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌,, విదేశాంగ శాఖ కార్యదర్శితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు..ఉగ్రదాడి తర్వాత పరిస్థితులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం..
భద్రత కమిటీ 5 కీలక నిర్ణయలు తీసుకున్నట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి..
అటారీ-వాఘ సరిహద్దులను తక్షమే మూసివేత..ఇండిస్ వాటర్ ట్రీట్ ఒప్పందం నుంచి వైదొలగడం..పాకిస్తానీ పౌరులు భారతదేశంలోకి వచ్చేందుకు నిరాకరించడం,,అలాగే ఇప్పటికే భారతదేశంలోకి వచ్చిన వారు మే 1వ తేది లోగా తిరిగి వెళ్లిపోవాలి..భారత్ లో సార్క్ వీసాలు వున్న వారు 48 గంటల్లో వెనక్కు వెళ్లిపోవాలి..పాకిస్తాన్ రాయబారి కార్యాలయ సిబ్బంది 55 నుంచి 30 తగ్గించాలని నిర్ణయం..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *