26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుపై సంతకం చేసిన భారత్
అమరావతి: హిందు మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా వున్న భారత నావికాదళాన్ని మరింత సన్నద్ధం చేయడానికి ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ కంపెనీతో భారత్ సోమవారం ఒక ఒప్పందపై సంతకం చేసింది.. భారతదేశం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలుపై డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్& CEO ఎరిక్ ట్రాపియర్ సమక్షంలో భారతదేశం & ఫ్రాన్స్ మధ్య అంతర్-ప్రభుత్వ ఒప్పందం జరిగింది..ఈ ఒప్పందం జూలై 2023లో రాఫెల్ మెరైన్ ఎంపిక ప్రకటన తర్వాత జరిగింది..అంతర్జాతీయస్థాయిలో సంప్రదింపుల తరువాత రాఫెల్ మెరైన్ వర్షన్ విమానం సామర్థ్యాల పట్ల భారత అధికారుల సంతృప్తి వ్యక్తం చేశారు..దింతో ఫ్రాన్స్ వెలుపల భారత నావికాదళం మొదటగా రాఫెల్ మెరైన్ మన దేశ యుద్ద నౌకల నుంచి ఉపయోగిస్తుంది.