AP&TG

పాకిస్థాన్‌పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చు-డిప్యూటీ సీఎం పవన్

మధుసూదన్ కుటుంబానికి రూ.50 లక్షలు..

అమరావతి: భారతదేశ జాతీయ నినాదం”సత్యమేవ జయతే” అయితే అమెరికా “దేవునిపై, మేము విశ్వసిస్తాము” అనే నినాదానికి భిన్నంగా,,మనం మతానికి,,దేవుడికి అతీతంగా సత్యని నమ్ముతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు..మంగళవారం జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన వీరులకు జనసేన సంతాపం ప్రకటించింది..మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు నేతలు మౌనం పాటించారు. ఉగ్రదాడి మృతులకు డిప్యూటీ సీఎం నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అమాయకులను అత్యంత దారుణంగా చంపారన్నారు..

ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదు:- ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని,,పహల్గామ్‌ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు.. కాశ్మీరు అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను వేటాడారని,, ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు..పర్యాటలకు ఎంతో నమ్మకంతోనే కశ్మీర్‌ కు వెళ్లారన్నారు.. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని,,అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి ఘటన జరిగిందన్నారు.. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని,,ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.

ఆ దేశం వెళ్లిపోవచ్చు:- లక్షలాదిమంది కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోవడంతో, అప్పటి నుంచి కశ్మీర్‌ మండుతూనే ఉందన్నారు..కశ్మీర్ భారత్‌లో భాగమే, ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు..భారత్‌లో ఉండి పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని కొంత మందిపై మండిపడ్డారు..అంతగా పాకిస్థాన్‌పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చని అన్నారు.. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే సెక్యూరీస్టులు అని చెప్పుకునే వారు నమ్మరెందుకు అని ప్రశ్నించారు.. అతిమంచితనం కూడా మంచిది కాదని,,కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా? అతి సహనం కూడా ప్రమాదకరం అని అభిప్రాయపడ్డారు.. జనసేన ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే,,పార్టీ భావలు జాతీయ విధానమని తెలిపారు..ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యంతో కూడుకున్న పని అని అన్నారు..ప్రపంచంలో హిందువులకు ఉన్నది భారతదేశం ఒక్కటే అని,,ఇక్కడ కూడా హిందువులనే టార్గెట్‌ చేస్తే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు..హత్య చేసి మోదీకి చెప్పుకోండి అని ఉగ్రవాదులు అన్న విషయం పర్యాటకులు చెబుతున్నారని తెలిపారు.. పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించామని గుర్తుచేశారు.

జనసేన పక్షాన రూ.50 లక్షలు:- ఉగ్రదాడిలో మరణించిన సోమిశెట్టి.మధుసూదన్ కుటుంబానికి,, జనసేన పక్షాన రూ.50 లక్షలను పవన్ ప్రకటించారు..అతని కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..‘మనం ఏదొక రూపంలో ప్రాణాలు కోల్పోతాం…అది దేశం‌కోసం అయితే… మన‌ మరణానికి ఒక అర్ధం ఉంటుందన్నారు.. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారందరికి జనసేన పక్షాన నివాళి అర్పిస్తున్నాం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *