సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో అపశ్రుతి-గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి
అమరావతి: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో, స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గొడ కూలడంతో 8 మంది భక్తులు మృతి చెందారు..తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. బుధవారం వేకువ జామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.. సింహాచలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.. సింహగిరి బస్టాప్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కుప్పకూలింది.. ఈదురుగాలులకు భారీ టెంట్(షామియాన) ఎగిరి గోడపై టెంట్ పడడంతో కూలినట్లు తెలుస్తున్నది.. ఇటీవలనే రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద భారీ గోడను నిర్మించారు.. శిథిలాలల కింద మరికొంత మంది చిక్కుకొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.. సంఘటనా స్థలంలో NDRF, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.. హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.