AP&TG

రాజధాని రైతులతో ముగిసిన సీఎం చంద్రబాబు సమావేశం

అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని,, 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం చేయడం కుదరలేదని,,ఉమ్మడి రాజధాని సమస్య లేదు కాబట్టి అమరావతికి చట్టబద్ధత తెస్తామని సీఎం చంద్రబాబు రైతులకు తెలిపారు..సోమవారం రాజధాని రైతుల పెండింగ్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు..రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రారంభోత్సవంకు రైతుల్ని రావాలని,,సభా వేదిక వద్ద రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కుటుంబసభ్యులతో రాజధాని రైతులు రావాలని సీ.ఎం ఆహ్వానించారు..రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని రైతులు తెలియచేయగా, రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకు రుణాల సమస్య పరిష్కారిస్తాన్నాని సీఎం హామీ ఇచ్చారు..రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూసమీకరణపై సమావేశంలో చర్చ జరుగగా, రైతులకు ఉన్న అనుమానాలను సీఎం చంద్రబాబు నివృత్తి చేశారు.. మహానగరంగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండాలని అలాగే నగరానికి పెట్టుబడులు, విమానాశ్రయం ఉంటే కలిగే మేలు వివరించడంతో సీఎం వివరణ పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *