వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం-పంటల విషయంలో ప్రత్యేక దృష్టి-మంత్రి నారాయణ
నెల్లూరు: నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ,రామనారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా జడ్పీ చైర్ పర్సన్, మంత్రులకుపుష్పగుచ్చం అందచేసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 62 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని వారిని దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విత్తనాలు, ఎరువులు కొరత రాకుండా చూస్తామని చెప్పారు. పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామని, మండల స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆయకట్టు స్థిరీకరణ విషయంపై చర్యలు చేపడుతున్నామని, కాలువల పూడికలు తీయాలని అధికారులను అదేశించామని చెప్పారు. త్వరలోనే సోమశిల డ్యాంకు సంబంధించి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, జడ్పీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.