DISTRICTS

పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించిన పరిశ్రమల శాఖ కార్యదర్శి

నెల్లూరు: రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు భూములను రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య శాఖల కార్యదర్శి ఎన్. యువరాజ్, జిల్లాకలెక్టర్ ఆనంద్ తో కలసి పరిశీలించారు. శుక్రవారం రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లోని అలగాయపాలెం వ్యవసాయ భూములను,,కరేడు చెరువును పరిశీలించి ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు.. చెరువులో నీరు సమృద్ధిగా ఉండటం చూసి వర్షాధారమా లేక ప్రాజెక్ట్ ద్వారా నీరు నింపారా అని విచారించారు. టెంకాయచెట్లపాలెం గ్రామ,, కావలి రూరల్ అనెమడుగు గ్రామ పంచాయతీ లోని సర్వాయపాలెం, అనెమడుగు గ్రామాల భూములను పరిశీలించారు.అక్కడ నుంచి చెన్నాయపాలెం భూములను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇండోసోల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ పురోగతి గురించి కంపెనీ ప్రతినిధులను విచారించారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు సి ఇ ఒ ప్రవీణ్ ఆదిత్య, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, కావలి ఆర్డిఓ వంశీకృష్ణ, రామాయపట్నం రాజశేఖర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *