పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్
అమరావతి: ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. పవన్ను చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్,,అసభ్యకరమైన భాషతో మెసేజీలు రావడంతో,,పేషీలో సిబ్బంది ఈ విషయం పవన్ దృష్టికి తీసుకుని వచ్చారు..పవన్ వెంటనే డీజీపీకి ఫిర్యాదు చేశారు..దింతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు..బెదిరింపులకు పాల్పడిన నిందితుడు విజయవాడలోని లబ్బిపేట నివాసి నూక.మల్లికార్జున్ అని,, మానసిక స్థితి సరిగ్గా లేదని,, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.. అదుపులోకి తీసుకున్న నిందితుడిని విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు..గతంలో వంగలపూడి.అనితకు కూడా ఇతను బెదిరింపు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలిసింది..వైజాగ్లో. నూక.మల్లికార్జున్పైత 354 కేసు నమోదై వుంది.