AP&TG

జగన్ ప్రభుత్వం పాలనలొ జరిగిన మద్యం కుంభకోణంపై సీట్ ఏర్పాటు

అమరావతి: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం పాలన సమయంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్‌లో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ను ఏర్పాటు చేసింది..సిట్ అధిపతిగా విజయవాడ సీపీ రాజశేఖర బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.. సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు,, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్,,ఆర్.శ్రీహరిబాబు,,డీఎస్పీ పి.శ్రీనివాస్,, సీఐలు కె.శివాజీ,, సీహెచ్.నాగ శ్రీనివాస్‌ను నియమించింది. మద్యం కుంభకోణంపై గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది.. దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిట్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదనలు పంపగా,, డీజీపీ ప్రతిపాదనల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూటమి ప్రభుత్వం నియమించింది..సిట్ అధికారులు అడిగిన నివేదికను ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. అలాగే ప్రతి 15 రోజులకోసారి దర్యాప్తు పురోగతిపై విచారణ నివేదిక ఇవ్వాలని,,వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి సీఐడీ, డీజీ ద్వారా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *