సి.ఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
ప్రతిపాదనలకు అమోదం..
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన 1376వ (39వ) క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు శాఖలకు సంబంధించి అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. పరిశ్రమలు & మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు & వాణిజ్యం, రెవిన్యూ (ఎక్సైజ్) శాఖ, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ: ఉన్నత విద్య, రెవెన్యూ శాఖ, దేవదాయ శాఖ, పురపాలక పరిపాలన & పట్టణాభివృద్ధి శాఖ, యువజన వ్యవహారాలు, పర్యాటకం & సంస్కృతి శాఖ, నీటి వనరుల అభివృద్ధి శాఖ, ఇంధన శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు కేబినెట్ అమోదించడం జరిగిందని తెలిపారు.
- పరిశ్రమలు & మౌలిక సదుపాయాల శాఖ:– ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APLINC)ను సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. లాజిస్టిక్స్ మరియు పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కోసం సంస్థాగత మూలధనాన్ని సమీకరించేందుకు తగిన పరిమాణంలో ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ ఫండ్ను ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభ స్పాన్సర్గా మొత్తం మూలధనంలో 10-20% వాటా అందించనుంది. వృత్తిపరమైన నిర్వహణ మరియు పాలనా నిర్వహణ కోసం ఆస్తి నిర్వహణ కంపెనీ మరియు ట్రస్టీ సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. హోల్డింగ్ కంపెనీ ఆధారిత సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించి, న్యాయ పరిశీలన తర్వాత కంపెనీను చట్టబద్ధంగా నమోదు చేయడానికి అనుమతి ఇచ్చింది. సంబంధిత శాఖలు సంస్థను స్థాపించడం, చట్టబద్ధ నిర్మాణం, దశలవారీ అమలు కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారం కల్పించింది. న్యాయ, ఆర్థిక మరియు లావాదేవీ మద్దతు కోసం వృత్తిపరమైన సలహాదారులను నియమించడానికి అనుమతి ఇచ్చింది.
- పరిశ్రమలు & మౌలిక సదుపాయాల శాఖ:– జి.ఓ.ఎంస్.నం.5, పరిశ్రమలు & వాణిజ్యం (ఓడరేవులు) శాఖ, తేదీ 09.04.2025లో పేర్కొన్న కంపెనీ పేరును “M/s ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” నుండి “M/s AMNS పోర్ట్స్ రాజయ్యపేట ప్రైవేట్ లిమిటెడ్” అనే స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)గా మార్చడానికి ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా డీ.ఎల్.పురంలో 2.9 కిలోమీటర్ల వాటర్ఫ్రంట్ పొడవుతో క్యాప్టివ్ ఓడరేవును కొత్తగా ఏర్పాటు చేసిన SPVకి కేటాయించేందుకు సవరించిన ఉత్తర్వులు జారీ చేయడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు.కేబినెట్ ముందుకు వచ్చిన ఆంశాలను చర్చించి అమోదించరన్నారు.

