భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు”-ప్రధాని నరేంద్ర మోదీ
ఇంగ్లాండ్ నుంచి అతిపెద్ద వాణిజ్య బృందం..
అమరావతి: భారతదేశం-ఇంగ్లాడ్ లు “సహజ భాగస్వాములు” అని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ,చట్ట బద్దమైన పాలనతో ఉమ్మడి విలువలతో కట్టుబడి ఉన్నాయని UK ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్తో సంయుక్త ప్రకటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని అవశ్యకత తెలియ చేస్తూ,రోజు,రోజుకు పెరుగుతున్న అంతర్జాతీయ సవాళ్ల మధ్య ప్రపంచ స్థిరత్వం,ఆర్థిక పురోగతికి ఇది ఒక ముఖ్యమైన స్తంభంగా పనిచేస్తుందని మోదీ అన్నారు.గురువారం ముంబైలో యూకే ప్రధానితో కలిసి ప్రధాని మోదీ పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
మేము కుదుర్చుకున్నఅతిపెద్ద ఒప్పందం:- జూలైలో రెండు దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అత్యంత ముఖ్యమైనదని బిట్రన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. తాము యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించినప్పటి నుంచి మేము కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది అని స్టార్మర్ తెలిపారు.ఇది భారతదేశం ఇప్పటివరకు కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కూడా అని తాను భావిస్తున్నానని,,ఇది ఇరుదేశాలకు చాలా ముఖ్యమైనదని స్టార్మర్ పేర్కొన్నారు.
టారిఫ్ 15 శాతం నుంచి 3 శాతానికి:- ఈ ఒప్పందంతో భారత్తో ఇంగ్లాండ్ వాణిజ్యం సులభంగా జరుగుతుంది. జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుకె పర్యటన సందర్భంగా యుకె-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జరిగింది. రెండు దేశాల మధ్య ఏటా £25.5 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం అమల్లోకి రావడం ద్వారా బ్రిటిష్ ప్రజలకు మరిన్ని అవకాశాలు,ఆర్దిక స్థిరత్వం, ఉద్యోగాలు లభిస్తాయని బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్తో వ్యాపారానికి బ్రిటిష్ వాణిజ్యవర్గాలకు తలుపులు తెరచుకున్నాయని పేర్కొంది.బ్రిటిష్ ఉత్పత్తులపై భారత్ సగటు టారిఫ్ 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గనుందని బ్రిటన్ తెలిపింది. భారత మార్కెట్లో ఇంగ్లాండ్ ఉత్పత్తులు, శీతల పానీయాలు, సౌందర్య సాధనాలు, కార్లు, వైద్య పరికరాలు తదితరాలు సులభంగా విక్రయించుకోవచ్చని వివరించింది.