లిక్కర్ కేసులోఎంపీ మిథున్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్
అమరావతి: ఏపీ లిక్కర్ కేసులోఎంపీ మిథున్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. సోమవారం ఆర్డర్ కాపీలు జైలు సూపరిండెంటెంట్కు మిథున్రెడ్డి తరుఫు న్యాయవాది మెయిల్ చేశారు. రూ.2 లక్షలతో రెండు ష్యూరిటీలు,, వారంలో రెండుసార్లు సంబంధిత పోలీసు స్టేషన్ లో సంతకాలు పెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్రెడ్డి, 71 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.