NATIONALPOLITICS

జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అమరావతి: జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన “వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌” బిల్లుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం..బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయి.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తరువాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి (JPC) సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి..ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ర్టాల అసెంబ్లీల స్పీకర్‌లనూ ఆహ్వానించనున్నట్టు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *