భగవద్గీత,నాట్య శాస్త్రానికి యునెస్కో నుంచి గుర్తింపు
అమరావతి: భారతీయులు ఎంతో పవిత్రంగా పూజించే భగవద్గీతకు యునెస్కో నుంచి గుర్తింపు లభించింది.. భగవద్గీతతో పాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి కూడా గుర్తింపు లభించింది..భారతదేశ సాంస్కృతిక,, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి “యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్”లో చోటు దక్కింది..ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు..ఈ గుర్తింపు ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా అభివర్ణించారు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం అని,,యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత,, నాట్యశాస్త్రాన్ని చేర్చడం మన భారతీయ గొప్ప సంస్కృతి,, జ్ఞానానికి దక్కిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు.