NATIONAL

వక్ఫ్ చట్టంలో సవరణలపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ

అమరావతి: దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం వక్ఫ్ చట్టంలో సవరణ చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపింది.. గురువారం ప్రధాని మోదీని కలిసిన బృంద సభ్యులు సవరణపై సంతోషం వ్యక్తం చేశారు.. ఇది తమ సమాజం తరఫున చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని వారు తెలిపారు..సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి దార్శనికతపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు..మరో వైపు దేశంలో కొన్ని రాష్ట్రల్లో కొంత మంది ముస్లింలు వక్ఫ్‌ చట్టంలో సవరణ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా,,దావూదీ బోహ్రా కమ్యూనిటీ పెద్దలు ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలియజేయండి ప్రాధాన్యతను సంతరించుకుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *