దక్షిణ కొరియాలో ఘోర విమానం ప్రమాదం-179 మంది సజీవదహనం
అమరావతి: దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్పోర్టులో బ్యాంకాక్ నుంచి ముయాన్కు వచ్చిన బెజూ ఎయిర్ ఫ్లైట్కు చెందని 7C-2216 బోయింగ్ విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి, రన్వేపై వున్న రక్షణ గోడను ఢీకొని పేలిపోయింది..భారీ మంటలు చెలరేగడంతో విమానంలోని 179 మంది సజీవదహనమయ్యారు..ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయపడ్డారు..ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలో విమానంలో 175 మంది ప్రయాణికులు,, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 181 మంది ఉన్నట్లు జెజూ విమానయాన సంస్థ ప్రకటించింది.. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ముందు చక్రం తెరుచుకోకపోవడంతో విమానం రన్వేకు తగిలింది..దింతో విమానం అదుపు తప్పి రన్వే పక్కన ఏర్పాటు చేసిన కాంక్రీటు గోడను ఢీకొట్టడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయని తెలిపారు.. ఈ ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందిస్తూ, తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.