NATIONALOTHERSWORLD

ప్రధాని మోదీకి “మిత్ర విభూషణ పురస్కారం” ప్రధానం చేసిన శ్రీ లంక ప్రభుత్వం

అమరావతి: భారత్‌-శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా  ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది..“మిత్ర విభూషణ పురస్కారం” దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం..శ్రీలంకతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల నాయకులను గౌరవించడానికి ప్రత్యేకంగా ఈ అవార్డును శ్రీ లంక ప్రభుత్వం రూపొందించింది.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పౌరపురస్కారం.. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం “శ్రీలంక మిత్ర విభూషణ” ప్రదానం చేయాలని నిర్ణయించిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను..భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ గౌరవానికి ఎంతో అర్హులని మేం దృఢంగా విశ్వసిస్తున్నాం” అని లంక అధ్యక్షుడు దిస్సనాయకే అన్నారు..ఈ పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ,, ఈ గౌరవం కేవలం వ్యక్తిగత గుర్తింపు కాదని, 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవమన్నారు..పురస్కారం అందించిన శ్రీలంక అధ్యక్షుడికి, ప్రభుత్వానికి, శ్రీలంక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..రెండు పొరుగు దేశాల మధ్య దీర్ఘకాల సంబంధానికి, బలమైన స్నేహానికి ఈ గౌరవం నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *