HEALTHNATIONALOTHERS

మంకీపాక్స్‌ వ్యాధిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ అధికారులతో అత్యవసర సమీక్ష

అమరావతి: ఆఫ్రికా ఖండం నుంచి వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్‌ వ్యాధి భారత్‌లో వ్యాప్తి చెందకుండా  అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని మోదీ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ వ్యాధిపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.. ప్రిన్సిపల్ సెక్రటరీ డా.పీకే మిశ్ర నేతృత్వంలోని అధికారులతో బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు..మంకీపాక్స్‌ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులు సమీక్షించారు.ఈ సందర్బంలో ప్రధాని మోదీ”రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి,,వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు..ఈ సంవత్సరంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15,600 మంకీపాక్స్ కేసులు నమోదు కాగా మంకీపాక్స్‌ తో 537 మంది మృతి చెందారు.. WHO ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది..ఇప్పటి వరకు భారత్‌దేశంలో ఒక్క మంకీ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదు..ఆఫ్రికాలోని అనేక రాష్ట్రాల్లో మంకీపాక్స్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ,,ఆప్రమత్తత నోట్ ను విడుదల చేసింది..కేసులను సత్వరమే గుర్తించేందుకు నిఘా పెంచాలని, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు..ముందస్తు రోగ నిర్ధారణ కోసం 32 టెస్టింగ్ ల్యాబరేటరీలను సిద్ధం చేశారు..వ్యాధిని అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని,,అదే సమయంలో మంకీపాక్స్ లక్షణాలపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *