AP&TGCRIME

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం 5మంది మృతి-విచారం వ్యక్తం చేసిన సీ.ఎం,డిప్యూటి సీ.ఎం

అమరావతి:- తిరుపతి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు..తమిళనాడు నుంచి తిరుమల దర్శనానికి వెళ్తున్న భక్తులు పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో కారులోని వారు ప్రాణాలు కోల్పోయారు..ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు.. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సూచించారు. (తమిళనాడుకు చెందిన 7 భక్తులు కారులో తిరుమల నుంచి బయలుదేరారు.. చంద్రగిరి నియోజకవర్గంపాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప‌్ప రెడ్డి పల్లి వద్ద కారు ముందు వెళ్తున్న వాహనంను ఓవర్‌టేక్ చేయబోయి అదుపుతప్పి కంటైనర్‌ ఢీ కొట్టి ఆపై కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది.. మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు, ఒక బాలుడు ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ గీతమ్మ, బాలుడు క్రీస్వీన్‌లకు రుయాలో ప్రథమ చికిత్స చేశారు.)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *