3 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: ఉత్తరప్రదేశ్,, తమిళనాడు,, కర్ణాటక మధ్య కనెక్టివిటీని పెంచేందుకు 3 వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు..మీరట్ సిటీ-లక్నో,, మధురై-బెంగళూరు,, చెన్నై ఎగ్మోర్-నాగర్ కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వర్చువల్ విధానంలో ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ చర్యల్లో భాగంగా కొత్త రైళ్లతో మరింత వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం సాకరమవుతుందని పేర్కొంది..మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా వందే భారత్ రైళ్లను తొలిసారిగా 2019 ఫిబ్రవరి 15వ తేదిన ప్రవేశపెట్టారు.. వేగవంతమైన ప్రయాణం,,అధునిక సౌకర్యలతో ప్రయాణికులకు అందించేందుకు ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి..దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతూ ప్రయాణం సాగిస్తున్నాయి..