NATIONALPOLITICS

కేజ్రీవాల్ మద్యం,డబ్బు కుంభకోణాలలో చిక్కుకున్నారు-అన్నాహాజరే

అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా ఫలితాలు వస్తున్న నేపధ్యంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం స్పందిస్తూ,, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను చెప్పినదానిని పట్టించుకోలేదని,, లిక్కర్ పాలసీపై మాత్రమే దృష్టి సారించారని వ్యాఖ్యనించారు. ఒక అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలని,,ముఖ్యంగా రాజకీయ జీవితం, నింద లేకుండా ఉండాలని,,ప్రజల కోసం త్యాగం అనే గుణం ఉండాలని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాన్నారు..ఈ లక్షణాలు వుంటేనే ఓటర్లకు కేజ్రీవాల్‌పై నమ్మకం కలిగిస్తాయని అయితే ఆప్‌లో అది లేదన్నారు.. వారు మద్యం,, డబ్బు కుంభకోణాలలో చిక్కుకున్నారు.. దింతో అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసిందని,, అందుకే వారికి ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్నారు.. కేజ్రీవాల్ తన సత్తా గురించి మాట్లాడి మద్యం కుంభకోణంలో చిక్కుకుకొవడం, ప్రజలు చూశారని హజారే వ్యాఖ్యనించారు..రాజకీయాల్లో ఆరోపణలు సర్వసాధారణం అయితే ఎవరైనా తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి వుంటుందని,,నిజం మాత్రమే సజీవంగా ఉంటుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *