ఇక నుంచి దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణిస్తాం-కేంద్రం
అమరావతి: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ల మధ్య ఎదురు దాడులు చోటు చేసుకుంటున్న నేపద్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాదానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.. ఇక నుంచి దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణించాలని నిర్ణయించింది..భవిష్యత్తులో దేశంలో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యను, భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే “యుద్ధ చర్య”గా పరిగణించాలని,, దానికి అనుగుణంగా ప్రతిస్పందించాలని భారతదేశం నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి..భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), భారత సాయుధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు.