ముందుగానే కేరళ తీరంను తాకనున్న నైరుతీ రుతుపవనాలు
అమరావతి: మే 27వ తేదీన నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది..ఒకవేళ అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే, 2009 తరువాత మొదటిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు IMD వెల్లడించింది..2009 సంవత్సరంలో మే 23వ తేదీన నైరుతీ కేరళలో ప్రవేశించాయి..సాధారణంగా జూన్ ఒకటో తేదీ వరకు కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి..ఈ రుతుపవనాల వల్లే దేశంలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది..అనంతరం జూలై 8వ తేదీలోగా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయి.. 2025 వర్షాకాలంలో సాధారణం కన్నా అధికంగానే వర్షం కురుస్తుందని నెల క్రిందటే IMD వెల్లడించింది..ఎల్ నినో పరిస్థితులు ఉండబోవని IMD పేర్కొన్నది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం నార్మల్ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు.